Wednesday, 6 February 2019

క్రైస్తవ వృద్దిని నిరోధించిన మూడు అంశాలు....

బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారి 5th volume page no 536 to 556

1... భారతదేశంలో స్థిరపడిన యూరోపియన్ల నీతిమాలినతనం, అవినీతి విశృంఖలత్వం
( మిస్టర్ కాయో రచించిన Christianity in India లో చూడవచ్చు )

2... మత స్వీకరణ క్షేత్రములో ఆధిక్యత కోసం కేథలిక్కులకు, కేథలిక్కేతరులకు మధ్య తగాదాలు.

👉 కేథలిక్కులకు ముందు భారత దేశంలో గల సిరియన్ క్రైస్తవులు పితృస్వామ్యానికి ప్రతీక.
విగ్రహారాధన విషయంలో పోర్చుగీసు కేథలిక్ చర్చిలు సిరియన్ చర్చిల ముందు నిందలపాలయ్యాయి.

👉 సిరియన్ క్రైస్తవులు సువార్త ప్రకటనల ద్వారా మత ప్రచారం చేసేవారు. రోమన్ కేథలిక్స్ విశ్వాసం ఆధారంగా మత ప్రచారం చేసేవారు.

3.. క్రైస్తవ మత ప్రచారంలో గల తప్పుడు పద్దతులు.

👉 మొదట మిషనరీలు బ్రాహ్మణులను మత మార్పిడి చేస్తే మిగతా అన్ని భారతీయ కులాలు క్రైస్తవ మతంలోకి వస్తాయని భావించారు.

👉 బ్రాహ్మణుల హిందూ మతం చెడ్డదని నిరూపించడానికి ప్రయత్నం చేశారు.

బ్రాహ్మణుల మరియు హిందువులలోని ఉన్నత కులాల కోసం పాఠశాలలు, కళాశాలలు వైద్యశాలలు స్థాపించారు .

ఈ సంస్థల నుండి బ్రాహ్మణులు మరియు సంపన్న వర్గాలు బాగా లాభాలు పొందాయి.

### #### ###
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత క్రైస్తవ మతాన్ని అస్పృశ్య వర్గాలు చేరుకున్నాయి .అప్పటి నుండి క్రైస్తవ మతం భారతదేశంలో వేగంగా వ్యాప్తి చెందడం మొదలైంది

No comments:

Post a Comment